Srikakulam: పలాస మండలంలో ఉద్రిక్తత.. టీడీపీ నేతపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

by Disha Web Desk 16 |
Srikakulam: పలాస మండలంలో ఉద్రిక్తత.. టీడీపీ నేతపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
X

దిశ, వెబ్ డెస్క్: పలాస మండలం టీడీపీ అధ్యక్షుడు లక్ష్మణరావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయన కారులో వెళ్తుండగా రామకృష్ణాపురం వద్ద ఘటన జరిగింది. దారి కాచి మరీ దాడికి దిగారు. ఈ దాడిలో లక్ష్మణరావుకు తీవ్రగాయాలు కాగా.. వాహనం ధ్వంసమయింది. విషయం తెలుసుకున్న టీడీపీ మహిళా నేత గౌతు శిరీష సంఘటానికి వెళ్లారు. స్థానికుల సాయంతో లక్ష్మణరావును అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అయితే ఈ దాడి వైసీపీ కార్యకర్తల పనేనని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అటు ఈ దాడి ఎవరు చేశారనేది తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. స్థానిక సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తిస్తామని చెప్పారు.



Next Story

Most Viewed