Palakonda: బారసాలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఒకరి మృతి

by Disha Web Desk 16 |
Palakonda: బారసాలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఒకరి మృతి
X

దిశ, పార్వతీపురం మన్యం: పాలకొండ మండలం అట్టలి జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన కుటుంబం పార్వతీపురం‌లో బారసాలకు వెళ్లి వస్తుండగా కారు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో శేషగిరిరావు (30) ఒకరు మృతి చెందారు. ప్రమాదం సమయంలో కారులో నలుగురు ప్రయాణీకులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed