రెండు బైకులు ఢీకొని మహిళ మృతి

by Vemula.Srinu Prasad |

కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సమీపంలో ముంబై జాతీయ రహదారిపై ఆదివారం రెండు స్కూటర్లు ఢీకొన్న ప్రమాదంలో సయ్యద్ బీబీజాన్ అనే మహిళ మృతి చెందింది. ...

రెండు బైకులు ఢీకొని మహిళ మృతి
X

దిశ, కోవూరు: కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సమీపంలో ముంబై జాతీయ రహదారిపై ఆదివారం రెండు స్కూటర్లు ఢీకొన్న ప్రమాదంలో సయ్యద్ బీబీజాన్ అనే మహిళ మృతి చెందింది. బుచ్చి వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ముత్యాలరావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Next Story