Nellore: కుమ్మరకొండూరులో ఇద్దరు దుర్మరణం

by Disha Web Desk 16 |
Nellore: కుమ్మరకొండూరులో ఇద్దరు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కుమ్మరకొండూరులో విషాదం జరిగింది. విద్యుత్ మోటారు రిపేర్ చేస్తుండగా కరెంట్ వైర్లు తగిలి ఇద్దరు దుర్మరణం చెందారు. రైతు కంచంరెడ్డి మల్లికార్జున్ రెడ్డికి చెందిన విద్యుత్ మోటార్ రిపేర్ అయ్యింది. దీంతో ఎలక్ట్రీషియన్ వేల్పుల నారాయణ మోటార్‌ను రిపేర్ చేశాడు. అనంతరం వైరును ఎలక్ట్రిక్ పోల్‌కు కట్టే క్రమంలో 11కేవీ కరెంట్ వైర్లు తగిలాయి. ఈ ఘటనలో ఎలక్ట్రీషియన్ వేల్పుల నారాయణ, రైతు కంచంరెడ్డి మల్లికార్జున్ రెడ్డిల అక్కడిక్కడే దుర్మరణం చెందారు. దీంతో కుమ్మరకొండూరు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.



Next Story