Nellore: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కి రూ.10 లక్షల విరాళం

by Disha Web Desk 16 |
Nellore: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కి రూ.10 లక్షల విరాళం
X

దిశ, నెల్లూరు: ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కి నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మిత్రుడు, ఆయుర్ద బిల్డర్స్ అధినేత, ప్రముఖ కాంట్రాక్టర్ ఎస్ వేణుగోపాల్ రెడ్డి రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి చెక్కును అందజేశారు. అనంతరం చిరంజీవి బ్లడ్ బ్యాంకులో గునుకుల కిషోర్‌తో కలిసి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ సినీరంగంలో చిరంజీవి స్వయంకృషితో ఎదిగి ఎంతో మందికి సాయం చేశారని చెప్పారు. అవగాహన లేని రోజుల్లోనే రక్తదానం, అవయవదానం వంటి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. చిరంజీవి స్పూర్తితో 70% మెగా అభిమానులు రక్తదానం చేస్తున్నారని తెలిపారు. తాము సైతం భాగస్వామ్యులు కావాలనే ఉద్దేశంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో రక్తదానం చేశామని తెలిపారు. ఇక ట్రస్ట్‌కి ఇచ్చిన ప్రతి రూపాయినీ సేవా కార్యక్రమాలకు పరిపూర్ణంగా ఉపయోగిస్తామని చిరంజీవి చెప్పినట్లు గునుకుల కిషోర్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed