SomiReddy: లోకేశ్ పాదయాత్రకే భయపడితే ఎలా?

by Disha Web Desk 16 |
SomiReddy: లోకేశ్ పాదయాత్రకే భయపడితే ఎలా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం ఆటంకం కలిగిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‍ రెడ్డి హెచ్చరించారు. యువగళం పాదయాత్రపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. పాదయాత్రను అడ్డుకోవాలని కుట్రలు చేస్తే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం గొల్లకండ్రిగ భోజన విడిది కేంద్రం వద్ద మాజీమంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. లోకేష్ పాదయాత్ర చేస్తే వైసీపీ ప్రభుత్వం తట్టుకోలేదని.. పాదయాత్ర మొదలు పెట్టిన రోజే కుప్పంలో ప్రకటించామని గుర్తు చేశారు.

చంద్రబాబు రోడెక్కితే వైసీపీ ఏమైపోతుందో...!

లోకేశ్ పాదయాత్రను చూస్తేనే భయపడిపోతున్న వైసీపీ ఇక చంద్రబాబు నాయుడు రోడ్డెక్కితే ఇక ఏమైపోతారనని సెటైర్లు వేశారు. నాడు జగన్ విశాఖ ఎయిర్ పోర్టులో రన్ వేపై కూర్చొని నిరసన చేశాడని.. ఆ విధంగా లోకేశ్‍ తిరగబడితే పోలీసులు తట్టుకోలేరని హెచ్చరించారు. పోలీసులు డ్రోన్‌లను భద్రతకు వినియోగించకుండా లోకేశ్ పాదయాత్రపై అసత్య ప్రచారాలు చేయడానికి‌ వాడడం సిగ్గుచేటని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed