Abdul Aziz: బెట్టింగ్ రాయుళ్లకు నో ఎంట్రీ

by Disha Web Desk 16 |
Abdul Aziz: బెట్టింగ్ రాయుళ్లకు నో ఎంట్రీ
X

దిశ, నెల్లూరు: క్రికెట్ బెట్టింగులు ఆడేవారిని, సింగల్ నెంబర్లు ఆడించేవారిని టీడీపీలోకి ఆహ్వానించమని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్ధుల్ అజీజ్ పేర్కొన్నారు. ఎవరైనా ఇంట్లో పండ్ల, పూల మొక్కలు నాటుకుంటారు కానీ గంజాయి మొక్కలు నాటుకోరన్నారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వదలమని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కార్యకర్తలకు జరిగిన నష్టాలకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దౌర్జన్యంగా పార్టీలో చేర్చుకున్న జున్ను రఘురామయ్య తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. వ్యవసాయం చేసేటప్పుడు కలుపు మొక్కలు వాటి అంతట అవే పుట్టుకొస్తాయని, వాటిని పీకేయాల్సిన పని రైతుదన్నారు. రాజకీయంలో పుట్టుకొస్తున్న కలుపు మొక్కలను కూడా పీకేస్తామని అబ్ధుల్ అజీజ్ హెచ్చరించారు.

Next Story

Most Viewed