ఒకే కుటుంబంలో ఐదుగురికి తల్లికి వందనం

by Vemula.Srinu Prasad |

వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలెంకి చెందిన సర్పున్నిసాకు అయిదుగురు పిల్లలు. వారందరూ బుచ్చిరెడ్డి పాలెంలోని ఉర్దూ స్కూల్‌లో చదువుతున్నారు....

ఒకే కుటుంబంలో ఐదుగురికి తల్లికి వందనం
X

దిశ, నెల్లూరు ప్రతినిధి: కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలెంకి చెందిన సర్పున్నిసాకు అయిదుగురు పిల్లలు. వారందరూ బుచ్చిరెడ్డి పాలెంలోని ఉర్దూ స్కూల్‌లో చదువుతున్నారు. ఆ ఐదుగురు పిల్లలకు సంబంధించి తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.13 వేలు చొప్పున ఐదుగురికి కలిపి రూ.65 వేలు వారి తల్లి సర్పున్నిసా ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఈ సందర్భంగా సర్పున్నిసా నెల్లూరులోని విపిఆర్ కార్యాలయంకు తమ పిల్లలతో వెళ్లి కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు.

Next Story