Gudur: రైల్వే స్టేషన్‌లో రైలు చైన్ లాగి ప్రయాణికుల ఆందోళన

by Disha Web Desk 16 |
Gudur: రైల్వే స్టేషన్‌లో రైలు చైన్ లాగి ప్రయాణికుల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా గూడూరులో రైలును నిలిపి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బరోని నుంచి కోయంబత్తూరు వెళ్తే రైలులో ఏసీ పని చేయలేదని, విజయవాడ నుంచి నీరు కూడా రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీకి చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. గూడూరులో స్టాపింగ్ లేకపోయినా చైన్ లాగి రైలును నిలిపి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. రెండు గంటల ఆలస్యం తర్వాత రైలు యధావిధిగా గూడూరు నుంచి వెళ్లిపోయింది.



Next Story

Most Viewed