Nellore: నాయుడుపేటలో క్షుద్ర పూజల కలకలం

by Disha Web Desk 16 |
Nellore: నాయుడుపేటలో క్షుద్ర పూజల కలకలం
X

దిశ, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట రాజగోపాలపురంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపుతుంది. దీనితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అరవ పెరిమిడి గ్రామానికి చెందిన మదనంబేటి గోపి రాజగోపాలపురం చివరి వీధిలో మూడంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఆదివారం పెళ్లకూరు మండలం జీలపాటూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గోపికి ధాన్యం వ్యాపార విషయమై గొడవ జరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో పోలీసులు ఇరువురికి సర్ది చెప్పి రాజీచేసి పంపించినట్లు తెలిసింది.

గురువారం అమావాస్య కావడం గోపి నిర్మిస్తున్న భవనంలో క్షుద్ర పూజలు చేయడంతో గోపితో గొడవ పడ్డవారే క్షుద్ర పూజలు చేయించి ఉంటారని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గోపి తెలిపారు.

Next Story

Most Viewed