Nellore: కావలిలో ఉద్రిక్తత.. కారం, రాళ్లు, కత్తులతో ఇరువర్గాల దాడులు

by Disha Web Desk 16 |
Nellore: కావలిలో ఉద్రిక్తత.. కారం, రాళ్లు, కత్తులతో ఇరువర్గాల దాడులు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కావలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంగయ్యగారి పాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కారం, రాళ్లు, కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జి వర్గీయులుగా గుర్తించారు. బెల్ట్ షాపు నిర్వహణపై ప్రశ్నించినందుకు వైసీపీ నేతలు దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed