సమస్య ల పరిష్కారం కోసం కృషి చేస్తా: ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి

by Disha Web Desk 16 |
సమస్య ల పరిష్కారం కోసం కృషి చేస్తా: ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి
X

దిశ, నెల్లూరు: అక్కున చేర్చుకుని ఆదరించిన విద్యా సంస్థల యాజమాన్యం, అధ్యాపకులుకు ఎల్లప్పుడు అండగా ఉండి, వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పేర్నాటి పాల్గొన్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన తనను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ విధులు, వాటి విధానాలపై క్షుణ్ణంగా తెలుసుకున్నానని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే టీచర్స్, లెక్చరర్స్‌కు హెల్త్ కార్డులు, పీఎఫ్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు.

Next Story

Most Viewed