Mla KotamReddy: సీఎం జగన్‌కు మరో అల్టిమేటం

by Disha Web Desk 16 |
Mla KotamReddy: సీఎం జగన్‌కు మరో అల్టిమేటం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ప్రభుత్వానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో అల్టిమేటం విసిరారు. 15 రోజుల్లోగా ఎన్టీఆర్ నెక్లెస్ రెడ్డు-గణేష్ ఘాట్ పనులను ప్రారంభించాలని కోరారు. లేని పక్షంలో నుడా కార్యాలయాన్ని ముట్టిస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు నుడా వీసీకి లేఖ రాసినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. అధికారులు చొరవ తీసుకుని రెండు వారాల్లోపు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఇంకా ప్రారంభంకాని పనులు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. టెండర్లు పిలిచి 6 నెలలు పూర్తయి, శంకుస్థాపన జరిగి 6 నెలలు దాటినా ఎన్.టి.ఆర్. నెక్లెస్ రోడ్డు - గణేష్ ఘాట్ పనులు ఇంకా ప్రారంభం కాలేదని విమర్శించారు. తన కలల స్వప్నం అయిన ఎన్.టి.ఆర్.నెక్లెస్ రోడ్డు - గణేష్ ఘాట్ నెల్లూరు జిల్లాకే ఒక మణిహారం అని వ్యాఖ్యానించారు. బారాషాహీద్ దర్గాకి ఆర్థిక అనుమతుల మంజూరుకు రాజకీయాలకు అతీతంగా అందరు ఒక్కతాటిపై నిలబడి కృషి చేశామో అలాగే ఎన్.టి.ఆర్. నెక్లెస్ రోడ్డు - గణేష్ ఘాట్‌కు కూడా రాజకీయాలకు అతీతంగా అందరు ఒక్కతాటిపై నిలబడి ముందుకు సాగితే అధికార యంత్రాంగం ముందుకు కదిలి పనులు ప్రారంభిస్తుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి అభిప్రాయపడ్డారు.

అందర్నీ భాగస్వామ్యం చేస్తాం

ఎన్.టి.ఆర్. నెక్లెస్ రోడ్డు - గణేష్ ఘాట్ అభివృద్ధికి అన్ని దేవస్థానాలకు వెళ్లి అందరిని ఇందులో భాగస్వామ్యం చేస్తామని శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. రూ. 17.55 కోట్లతో ఎన్.టి.ఆర్. నెక్లెస్ రోడ్డు - గణేష్ ఘాట్ పనులు పూర్తయితే ఏవిధంగా ఉంటుందో వీడియో ప్రెజెంటేషన్ వేసి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ప్రతినిధులకు వివరించారు.

ఇవి కూడా చదవండి : సీఎం జగన్ అనంతపురం పర్యటన వాయిదా



Next Story

Most Viewed