Good Friday: ఏసుక్రీస్తు శిలువ మోసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్

by Disha Web Desk 16 |
Good Friday: ఏసుక్రీస్తు శిలువ మోసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు కపాడిపాళెం సెయింట్ జోసెఫ్ ఆర్‌సీఎం చర్చి నందు జరిగిన గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ఘనంగా జరిగాయి. ఈ పార్థనల్లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకున్నారు. పాస్టర్లు అనిల్ కుమార్ యాదవ్‌కు తమ ఆశీస్సులు అందజేశారు. అనంతరం అనిల్ కుమార్ యాదవ్ శిలువ మోశారు. ఏసుప్రభు కృప, ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా ఉండాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కాయల సాహిత్య, పొట్లూరి రామకృష్ణ ఆచారి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story