Nellore: తోడేరు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ

by Disha Web Desk 16 |
Nellore: తోడేరు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా తోడేరు గ్రామంలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన ఆరు కుటుంబాలను మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం ఒక్కొక్క కుటుంబానికి రు.5 లక్షలను అందజేశారు. బాధిత కుటుంబాలను మంత్రి కాకాణి ఓదార్చారు. తోడేరు పడవ ప్రమాదం ఘటన తనను ఎంతో కలచివేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వెళ్ళగానే ఆయన ఎంతో ఉదారంగా స్పందించి ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారని చెప్పారు. చేతికి అందిన బిడ్డలను కోల్పోవడం బాధాకరమని, ఆ బిడ్డలను తీసుకో రాలేకపోయినా ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు.



Next Story

Most Viewed