Ap News: నెల్లూరు జిల్లాకు మహర్దశ.. త్వరలో మారిపోనున్న రూపురేఖలు

by Disha Web Desk 16 |
Ap News: నెల్లూరు జిల్లాకు మహర్దశ.. త్వరలో మారిపోనున్న రూపురేఖలు
X

దిశ, నెల్లూరు జిల్లా కావలి: రూ.300 కోట్లతో చేపట్టిన బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు 95 శాతం మేర పూర్తయ్యాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. హార్బర్‌లో జరుగుతున్న పనులను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణ, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ రికార్డు సమయంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులను చేపట్టామన్నారు. ఇప్పటికే 95 శాతం మేర పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. మౌలిక వసతులకు సంబంధించి మరో 5 శాతం పనులు మాత్రమే పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఈ పనులను కూడా త్వరలో పూర్తి చేసి ముఖ్యమంత్రితో ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు. ఈ హార్బర్ ఏర్పాటుతో సుమారు ఆరు వేల మంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అన్ని విధాల ఈ ప్రాంత రూపు రేఖలు పూర్తిగా మారి పోతాయన్నారు.

Next Story

Most Viewed