Nellore: ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం

by Disha Web Desk 16 |
Nellore: ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం
X

దిశ, నెల్లూరు: బద్వేల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించాయి. కలువాయి నుంచి బద్వేల్‌కు 40 మంది ప్రయాణికులతో బస్‌ బయల్దేరింది. అనంతసాగరం సమీపంలో బస్సు నుంచి పొగలు వస్తున్న విషయాన్ని డ్రైవర్‌కు గమనించారు. అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును వెంటనే నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించివేశారు. ఇదే సమయంలో బస్సు ఇంజిన్‌ నుంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు. బస్సు బ్యాటరీ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. మరో బస్సు ద్వారా ప్రయాణికులను తరలించినట్లు తెలిపారు.


Next Story