Nellore: వైసీపీ బుద్ధి చెప్తాం.. ఆ రోజు దగ్గర్లోనే ఉంది: జనసేన వార్నింగ్

by Disha Web Desk 16 |
Nellore: వైసీపీ బుద్ధి చెప్తాం.. ఆ రోజు దగ్గర్లోనే ఉంది: జనసేన వార్నింగ్
X

దిశ, నెల్లూరు సిటీ: వైసీపీ పెత్తందారులకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ హెచ్చరించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు గ్రావెల్ మాఫియా అవతారం ఎత్తి ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకుల ఆగడాలు పెరిగిపోయాయని విమర్శించారు. నెల్లూరులో తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి హేయమైన చర్య అన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష నేతలపై దాడులు చేసే విషమ సంస్కృతిని అరికట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, జనసేన కావలి పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయి, ఋషి తదితరులు పాల్గొన్నారు


Next Story

Most Viewed