Nellore: గంజాయి అమ్ముతున్న ఏడుగురు అరెస్ట్

by Disha Web Desk 16 |
Nellore: గంజాయి అమ్ముతున్న ఏడుగురు అరెస్ట్
X

దిశ,డైనమిక్ బ్యూరో: నెల్లూరులో గంజాయి ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. గంజాయి విక్రయించే ముఠాకు చెందిన ఏడుగురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 18 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం సీలేరుకు చెందిన వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సీలేరు నుంచి కొనుగోలు చేసి ఈ ముఠా పలు గ్రామాల్లో యదేచ్ఛగా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆదివారం గంజాయి విక్రయించేందుకు ముఠా సన్నద్ధమవుతుండగా కలిగిరి సీఐ సాంబశివరావు, కొండాపురం ఎస్ఐ ఖాజావలి పట్టుకున్నారు.



Next Story

Most Viewed