Tamballapalli: జోగి రమేశ్ బ్రదర్స్‌కు 14 రోజుల రిమాండ్

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి జోగి రమేశ్ బ్రదర్స్‌కు తంబళ్లపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది....

Tamballapalli: జోగి రమేశ్ బ్రదర్స్‌కు 14 రోజుల రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) బ్రదర్స్‌కు షాకులు మీద షాకులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసు(Ibrahimpatnam fake liquor case)లో ఇప్పటికే జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వారిద్దరినీ పీటీ వారెంట్‌పై తంబళ్లపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీనికి జోగి బ్రదర్స్‌కు ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు వారిద్దరిని మళ్లీ నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.

Next Story