Nellore: కుక్కల దాడిలో 15 మేక పిల్లల మృతి

by Disha Web Desk 16 |
Nellore: కుక్కల దాడిలో 15 మేక పిల్లల మృతి
X

దిశ, సంగం: కుక్కల దాడిలో 15 మేక పిల్లలు మృతి చెదిన ఘటన సంగం మండలం పెరమున గ్రామంలో చోటుచేసుకుంది. పెరమునకు చెందిన వన్నె ధర్మయ్య మేక పిల్లలను చూసుకుంటూ వాటిని పోషించి అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల 21 మేక పిల్లలను ధర్మయ్య కొనుగోలు చేసి పెంచుకుంటున్నారు. అయితే వీధి కుక్కలు దాడి చేసి 15 మేకపిల్లలను దొడ్డిలోనే చంపేశాయి. కుక్కల దాడికి బెదిరిపోయి 9 మేక పిల్లలు పారిపోగా వాటిలో నాలుగు దొరికాయి. 15 మేక పిల్లలు విగతజీవులుగా కనిపించడంతో ధర్మయ్య కన్నీరుమున్నిరయ్యారు. ఇటీవలే రూ.1.50 లక్షలు అప్పు చేసి మరీ మేకపిల్లలను కొన్నానని, వీటి మృతి వల్ల అప్పు మిగిలిపోగా కుటుంబ పోషణ భారమైందని ధర్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed