ఏపీ మత్స్యకారులను విడుదల చేసిన శ్రీలంక ప్రభుత్వం

by Gantepaka Srikanth |

ఏపీ మత్స్యకారులను విడుదల చేసిన శ్రీలంక ప్రభుత్వం

ఏపీ మత్స్యకారులను విడుదల చేసిన శ్రీలంక ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) దాటినందుకు శ్రీలంక నావికాదళం(Sri Lanka Navy) నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్య్సకారులను(AP Fishermens) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారిని భారత ప్రభుత్వ విజ్ఞప్తితో విడుదల చేసింది. కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు గురువారం విడుదల అయ్యారు. గూగుల్‌ మ్యాప్‌ తప్పుగా చూపించడంతో ఆగస్టు 4న శ్రీలంక జలాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. వీరిని అదుపులోకి తీసుకున్న శ్రీలంక కోస్ట్‌ గార్డ్.. శ్రీలంక జైలుకు తరలించారు. విషయం తెలిసిన భారత ప్రభుత్వం విజ్ఙప్తి చేయడంతో గురువారం రిలీజ్ చేశారు. మరో 2 రోజుల్లో సముద్రమార్గం ద్వారా మత్స్యకారులు కాకినాడకు చేరుకోనున్నారు.

Next Story