AP Assembly: మీరే ఇలా చేస్తే ఎలా.. ఏపీ మంత్రులపై స్పీకర్ అసహనం..

by Naga Rani Yarlagadda |

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన జరిగింది. అసెంబ్లీ ప్రారంభమై ప్రశ్నోత్తరాలు కూడా జరుగుతుండగా.. మంత్రులు ఇంకా హాజరు కాలేదు. చాలా సేపటికి సభకు వచ్చారు. దీంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వారిపై అసహనం వ్యక్తం చేశారు.

AP Assembly: మీరే ఇలా చేస్తే ఎలా.. ఏపీ మంత్రులపై స్పీకర్ అసహనం..
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీలో (AP Assembly) ఆసక్తికర ఘటన జరిగింది. అసెంబ్లీ ప్రారంభమై ప్రశ్నోత్తరాలు కూడా జరుగుతుండగా.. మంత్రులు ఇంకా హాజరు కాలేదు. చాలా సేపటికి సభకు వచ్చారు. దీంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu) వారిపై అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగే క్వశ్చన్ అవర్ (Question Hour)ను మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. ఇకపై సమయపాలన పాటించాలని, అసెంబ్లీ ప్రారంభ సమయానికల్లా అందరూ సభకు రావాలని హితవు పలికారు. క్వశ్చన్ అవర్ లో మొదటి ప్రశ్న కార్మికశాఖకు సంబంధించింది అడగ్గా.. ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Vasamsetty Subhash) ఆలస్యంగా వచ్చారు. దీంతో స్పీకర్ మంత్రులు సమయపాలన పాటించాలని, సభ సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఆదేశించారు.

Next Story