తల్లి కళ్లెదుటే.. రెండేళ్ల కొడుకు దుర్మరణం

by Thanuru Gopichand |   (  Updated:2025-02-05 06:42:13  IST  )

స్కూలు బస్సు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం పాతముప్పర్రు గ్రామంలో చోటు చేసుకుంది.

తల్లి కళ్లెదుటే.. రెండేళ్ల కొడుకు దుర్మరణం
X

దిశ, డైనమిక్​బ్యూరో : స్కూలు బస్సు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం పాతముప్పర్రు గ్రామంలో చోటు చేసుకుంది.వివరాలివి.. ఉదయాన్నే పెద్దకొడుకును స్కూలు బస్సు ఎక్కించేందుకు తల్లి తన మరో కుమారుడు రెండేళ్ల శ్రీదీక్షిత్ ను తీసుకుని వెళ్లింది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు బాలుడు బస్సు కింద పడి మృతి చెందాడు. కళ్లెదుటే కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Next Story