మా పొత్తు జనసేనతోనే- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

by Disha Web Desk 4 |
మా పొత్తు జనసేనతోనే- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
X

దిశ, ఉత్తరాంధ్ర: తమ పొత్తు జనసేనతోనేనన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అవినీతి రహిత పాలనే తమ ధ్యేయమని, 'సబ్ కా సాత్...సబ్ కా వికాస్' బీజేపీ లక్ష్యమని అన్నారు.

రాష్ట్రంలోనూ, దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ విత్తనాలేనని అన్నారు. బీజేపీ ఒక చారిత్రాత్మకమైన పార్టీ అని, ఏపీలో కూడా బలమైన శక్తిగా ఎదుగుతామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉండాలనేది ఏపీ బీజేపీ నిర్ణయమని, మైన్స్ పాలసీ దేశవ్యాప్తంగా మారుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కు జరిగే సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.



Next Story

Most Viewed