Somu Veerraju: మా పథకాలపై మీ స్టిక్కర్లేంటి?.. ఏపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఆగ్రహం

by Disha Web Desk 16 |
Somu Veerraju:  మా పథకాలపై మీ స్టిక్కర్లేంటి?.. ఏపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: పథకాల విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని ఉచిత పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం తమ బోర్డులు ముద్రించుకోవడాన్ని బీజేపీ పార్టీ నేతలు తప్పుబడుతోంది. కేంద్రం గురించి ప్రచారం చేయాలని సూచించింది. దీంతో బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల వార్ కొనసాగుతోంది.

కాగా ఏపీ రాష్ట్రంలో పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం కేంద్రం ఇస్తోంది. అయితే ఈ పథకాలను తాము ఇస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం యదేచ్ఛగా వాడేసుకుంటుంది. దీంతో ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పథకాలపై వైసీపీ స్టిక్కర్లేంటని ప్రశ్నిస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంపై లేఖ దాడి చేస్తోంది ఇప్పటికే ఈ విషయంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పలుమార్లు లేఖలు రాశారు. పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాకపోవడంతో తాజాగా కూడా మరో లేఖ రాశారు.

పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం పథకంపై సీఎం జగన్ ఫొటో ఉండటాన్ని సోము వీర్రాజు తప్పుబట్టారు. బియ్యం కేంద్రం ఇస్తుంటే ప్రభుత్వం తాము ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. పేద ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తు్న్న వాహనాలపైనా కేంద్రప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర పథకాలపై ఇప్పటికైనా మర్గదర్శకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed