Breaking: డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై రాళ్ల దాడి యత్నం.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజుపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి యత్నించారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది....

Breaking: డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై రాళ్ల దాడి యత్నం.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజుపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి యత్నించారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రామాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామాలయం స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ రోజు శ్రీరామనవమి కారణంగా స్థానికుల ఆహ్వానం మేరకు ఆలయం వద్దకు ఆయన వెళ్లారు. ఈ సమయంలో ఓ వర్గానికి చెందిన కొందరు రాళ్ల దాడికి ప్రయత్నం చేశారు. అయితే కూటమి నేతలు అడ్డుకున్నారు. దీంతో వారిపైనా రాళ్లు, మేకులతో దాడి చేశారు. ఈ దాడిలో కూటమి నేతలకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా మోహరించారు. రఘురామరాజును అక్కడి నుంచి భద్రతగా పంపించారు. ఘటనపై విచారణను ముమ్మరంగా చేశారు.

Next Story