నిశ్శబ్ద విప్లవం బహిరంగ విప్లవమవుతోంది: జగన్ సర్కార్‌కు యనమల వార్నింగ్

by Disha Web Desk 21 |
నిశ్శబ్ద విప్లవం బహిరంగ విప్లవమవుతోంది: జగన్ సర్కార్‌కు యనమల వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘రాష్ట్రంలో ప్రజలంతా నిశ్శబ్దంగా ఉన్నారని భావించారు. జగన్ రెడ్డి దోపిడీ, మితిమీరిన అహంకారంతో ప్రజల తిరుగుబాటు బహిరంగమవుతోంది’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. ‘తొలుత జగన్ రెడ్డి చేతకాని పాలనపై సొంత ఎంపీ రఘురామ కృష్ణంరాజు బయటపెట్టారు.తర్వాత ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేశారు. పంచాయతీల్లోని సమస్యలపై ఎంపీటీసీలు, సర్పంచులు గళం విప్పి నిలదీశా. అభ్యర్ధుల మార్పు నిర్ణయాలతో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మరోవైపు నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ అరాచకాలు, ధరల బాడుడు, పన్నుల మోత, ఇసుక, మద్యం వంటి అంశాలపై నిశ్శబ్దంగా ఉన్న సామాన్యులు గేరు మార్చి స్వరం విప్పుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసినందుకు అంగన్వాడీ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు, మున్సిపల్ ఉద్యోగులు రోడ్డెక్కి సమరశంఖం పూరించారు’ అని యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీల ఆందోళనపై యనమల రామకృష్ణుడు స్పందించారు.‘ ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలను రూ.4200 నుండి రూ.10,500 చేశామని గుర్తు చేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ అంగన్వాడీలకు అండగా ఉంటానని...తెలంగాణ కంటే వెయ్యి అదనంగా ఇస్తామన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణలో రూ.13,500 ఇస్తుంటే ఇక్కడ అంతకంటే తక్కువగా రూ.11,500 మాత్రమే ఇస్తూ మోసం చేస్తుండడంపై అంగన్వాడీలు రోడ్డెక్కారు అని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు.

ప్రభుత్వంపై సమ్మెసైరన్‌లు

వైసీపీ అధికారంలోకి వస్తే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని నమ్మించి వైఎస్ జగన్ మోసం చేశారు అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చాక రూ.5వేల వేతనాల వాలంటీర్ ఉద్యోగాలతో సరిపెట్టుకోవాలనే నయవంచనపై వాలంటీర్లు ఇప్పటికే సమ్మె నోటీసులిచ్చారు అని చెప్పుకొచ్చారు. వారి తిరుగుబాటే యువగళం విజయవంతానికి నాంది అని అన్నారు. పనికితగ్గ వేతనం ఇస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు తమ వేతనాలు రూ.26 వేలకు పెంచాలంటూ మున్సిపల్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు అని చెప్పుకొచ్చారు. కనీస వేతనం, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పించాలి, పనిభారం తగ్గించాలి, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా సెలవులు ఇవ్వాలనే డిమాండ్లతో ఆశ వర్కర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు అని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. అమరావతే రాజధాని అనే మాటపై మడమ తిప్పి మూడు రాజధానులంటూ దగా చేసినందుకు అమరావతి రైతులు దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. పార్టీ పెట్టిన రోజు నుండి వెంటే ఉన్న నాయకుల్ని నమ్మించి మోసం చేసినందుకు వెంట నడిచి తప్పు చేశామంటూ వారంతా రోడ్డెక్కి నినదిస్తున్నారు అని మండిపడ్డారు. జగన్ రెడ్డి మేలు కోసం సొంత నియోజకవర్గంలోని రాజధానిపై కేసులతో నిందలేసి, అభివృద్ధిని అడ్డుకుని తప్పు చేశానంటూ ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారని గుర్తు చేశారు. వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ప్రజల ముందు తలదించుకోవాల్సి వచ్చేదంటూ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు బహిరంగంగా ప్రకటించి జగన్ రెడ్డి చేతకాని పాలనను, దుర్మార్గాలను బట్టబయలు చేశారన్నారు.

జనం తిరుగుబాటు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన దాదాపు రూ.1.14 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 120కి పైగా సంక్షేమ పథకాలు రద్దు చేశారు. వందల మందిని హత్య చేశారు. వేలాది మందిపై దాడులకు పాల్పడ్డారు. తప్పుడు కేసులతో వేధించడంపై ఆయా వర్గాలన్నీ రోడ్డెక్కుతున్నాయని అన్నారు. మద్యాన్ని నిషేధించిన తర్వాతే అధికారంలోకి వస్తానని ఎన్నికలకు ముందు మహిళలకు మాటిచ్చిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక రూ.2లక్షల కోట్ల విలువైన కల్తీ మద్యం అమ్మి, లక్ష కోట్లు దిగమింగాడు. వేలాది మంది ప్రాణాలు తీయడంపై మద్య నిషేధం ఎక్కడంటూ మహిళలు రోడ్డెక్కుతున్నారు అని యనమల చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా బాదుడే బాదుడు అంటూ విద్యుత్ ఛార్జీల గురించి అరిచి గీపెట్టిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక దాదాపు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.58 వేల కోట్ల భారం వేశాడు. ట్రూ అప్ ఛార్జీలు, సర్ ఛార్జీల పేరుతో బిల్లుల బాదుడుపై జనం తిరగబడుతున్నారు అని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.

గత హామీలు గాల్లోకి

చెత్తపై పన్ను, మరుగుదొడ్లపై పన్నులు వేయడంపై ప్రజలు బహిరంగంగానే తిరుగుబాటు చేశారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు అని విమర్శించారు. పోలవరం ఎత్తు తగ్గించి పనులు ఆపేశాడు. అన్నమయ్య డ్యాం గేట్లు మరమ్మతులు చేయక కొట్టుకుపోయింది. కృష్ణా, తుంగభద్ర జలాలపై హక్కుల్ని ధారాదత్తం చేసి రాయలసీమ ప్రాజెక్టులకు ద్రోహం చేయడంపై సీమ ప్రజలంతా ఉద్యమిస్తున్నారు అని అన్నారు. మెరుగైన ఇసుక పాలసీ పేరుతో ఇసుక మొత్తాన్ని సిండికేట్‌గా మారి కొట్టేశాడు. వేల కోట్లు దోచేశాడు అని ఆరోపించారు. ‘ఇసుక దొరకక దాదాపు 132 వృత్తులు, వ్యాపారాలను దెబ్బతీయడంతో నిర్మాణదారులు బహిరంగంగానే గళమెత్తి జగన్ రెడ్డి దోపిడీపై మండిపడుతున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ హామీపై మడమ తిప్పాడు అని మండిపడ్డారు. రూ.3వేల పెన్షన్ హామీని తుంగలో తొక్కాడు. పీజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ దూరం చేశాడు.కౌలు రైతులకు రైతు భరోసా రద్దు చేశాడు. ఇలా మేనిఫెస్టో హామీలపై చేసిన మోసాలపై ప్రజలు నిలదీస్తున్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న హామీని గాలికొదిలి, పరిశ్రమలు తరిమేసి, పెట్టుబడులు రద్దు చేసిన విధానాలపై యువత గళమెత్తి ప్రశ్నిస్తోంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed