నేను YS బిడ్డననే విషయం మరువద్దు..YCP శ్రేణులకు షర్మిల మాస్ వార్నింగ్

by Disha Web Desk 19 |
నేను YS బిడ్డననే విషయం మరువద్దు..YCP శ్రేణులకు షర్మిల మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలోని లింగాలలో శుక్రవారం షర్మిల నిర్వహించిన సభలో జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ వైసీపీ శ్రేణులు వైఎస్ షర్మిల, సునీత ప్రసంగాలను అడ్డుకున్నారు. వైసీపీ శ్రేణుల ఆందోళనపై షర్మిల ఫైర్ అయ్యారు. ఓటమి భయంతోనే వైసీపీ కార్యకర్తలు రచ్చ చేస్తు్న్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా కడప జిల్లాకు చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డననే విషయం మరవొద్దంటూ వైసీపీ శ్రేణులకు షర్మిల మాస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్‌ను, ఎంపీ అవినాష్‌ను గెలిపిస్తే వాళ్లు మీకు చేసిందేంటో చెప్పాలని షర్మిల ఆందోళనకారులను నిలదీశారు. సభలో తీవ్ర ఉద్రిక్త నెలకొనడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్, వైసీపీ వర్గాలను చెదరగొట్టారు.

Next Story

Most Viewed