- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీ పోలీసులపై షర్మిల సంచలన కామెంట్స్! గొంతు పిసికి చంపాలని చూస్తారా ?
దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసులపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేక అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తడం కోసమా ? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్ధం గా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా ? గొంతు పిసికి చంపాలని చూస్తారా ? అని షర్మిల ఆరోపించారు.
వైసీపీ గూండాలను పక్కన పెట్టి మరి దాడులు చేయిస్తారా ? అని ఆమె ప్రశ్నించారు. ‘మీరు పోలీసులా.. లేక వైసీపీ కిరాయి మనుషులా ? ఇష్టారాజ్యంగా కొట్టడానికి ఎవరిచ్చారు మీకు హక్కు, కండువా లేని వైసీపీ కార్యకర్తలు మన పోలీసులు’ అని పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వైసీపీ గూండాల దాడి చేశారని, ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఈ ఘటన పై వెంటనే డీజీపీ స్పందించాలని, విచక్షణారహితంగా కొట్టిన పోలీస్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Read More..
కేసీఆర్ బాటలో చంద్రబాబు? రాజ శ్యామల యాగం.. సీఎం పదవి కోసం హోమాలా?