ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ఇచ్చాపురం చేరుకున్న షర్మిల.. ప్రయాణికులతో చిట్‌చాట్

by Disha Web Desk 1 |
ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ఇచ్చాపురం చేరుకున్న షర్మిల.. ప్రయాణికులతో చిట్‌చాట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల అప్పుడే తన ప్రచారాన్ని ప్రారంభించింది. పదునైన మాటలతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులపై మాటాల తూటాలు పేల్చుతున్నారు. ఇవాళ్టి నుంచి తొమ్మిది రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ శ్రీకాకుళంలెని కంచిలి వద్ద పల్లె వెలుగు బస్సెక్కి ఇచ్చాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పలువురు ప్రయాణికులతో ముచ్చటించారు. అమ్మ ఒడి, ఇళ్ల స్థలాలు అందరికీ అందాయా అన్ని అడిగారు. ఏపీలో ప్రభుత్వ పాలన ఏవిధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు.



Next Story

Most Viewed