బీకేర్ ఫుల్ : నేడు, రేపు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి

by Dishanational2 |
బీకేర్ ఫుల్ :  నేడు, రేపు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేడు,12 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ,218 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. రేపు 260 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది.

అలాగే రాష్ట్రంలో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే అక్కడక్కడ ఈదురు గాలులతో పాటు పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.



Next Story

Most Viewed