- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో సేవలు మరింత సులభతరం
ఏపీలో ప్రజా సేవలు సులభతరం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

వాట్సప్ గవర్నెన్స్ను తీసుకు వచ్చాం..
క్వాంటం టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాం..
విశాఖలో జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో చంద్రబాబు
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ప్రజా సేవలు సులభతరం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటికే వాట్సప్గవర్నెన్స్ను తీసుకు వచ్చామని , సంజీవని వంటి అత్యాధునిక సేవలను ఇంటి వద్దకే తీసుకు వస్తు న్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖలో 28వ ఈ గవర్నెన్స్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. డిజిటల్ఏపీ సంచికను ఆవిష్కరించారు. సివిల్సర్వీస్అండ్డిజిటల్ట్రాన్స్ఫార్మేషన్అనే థీమ్తో సదస్సు నిర్వహించారు. కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సు జరుపుతోంది. ఏఐ, సైబర్సెక్యూరిటీ, పౌరసేవలు, అగ్రి స్టాక్వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లలో ఐటీ రంగం కొత్త మలుపు తీసుకోబోతోందనిఅన్నారు. తలసరి ఆదాయంలో మనవాళ్లే టాప్, ప్రపంచంలోనే ఎక్కువ సంపాదిస్తోంది తెలుగు వారే అని తెలిపారు.
ఐటీలో హైదరాబాద్ను అగ్రగామిగా మార్చాం, నాలెడ్జ్ ఎకనామీనే మనల్ని నడిపించబోతోందని సీఎం తెలిపారు. సాంకేతికతకు అనుగుణంగా మనమూ మారాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇవాళ అన్ని సేవలకు ప్రజలకు ఆన్లైన్లో అం దుబాటులోకి వచ్చాయని తెలిపారు. పోటీ ప్రపంచంలో వినూత్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయన్నారు. సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చని అన్నారు. సరైన సమయంలో సరైన నాయకుడు దేశానికి ఉన్నాడని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు జరిగే నూతన సంస్కరణలను తీసుకు వచ్చారని తెలిపారు. క్వాంటం టెక్నాలజీపై మరింత దృష్టిపెడుతున్నామన్నారు. వాట్సప్గవర్నెన్స్తీసుకువచ్చామని తెలిపారు. ఐటీ రంగంలో భారతీయులకు చా లా నైపుణ్యం ఉందన్నారు. ఐటీ సంస్థలలో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు 30 శాతం ఏపీ వారే అని తెలిపారు. ప్రపంచంలో నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారత్కు చెందిన వారే అన్నారు. నాలెడ్జ్ఎకానమీకి ఆనాడు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే హైదరాబాద్కు మేలు జరిగిందన్నారు.
తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రముఖంగా మారిన పరిస్థితి అని వివరించారు. సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పనతో రూపురేఖలు మారాయని వివరించారు. ప్రముఖ సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్కంప్యూటింగ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఐబీఎం, టీసీఎస్వంటి సంస్థలు వస్తున్నాయన్నారు. స్టార్టప్లకు కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అత్యాధునిక సేవలు ఇటి వద్దకు తీసుకువచ్చేలా సంజీవని సేవలు ఉంటాయన్నారు. ధనిక, పేద తేడా లేకుండా యూనివర్సల్హెల్త్పాలసీని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. హెల్త్ పాలసీ ద్వారా రూ.2.50 లక్షల చొప్పున నగదు రహిత సేవలు అందిస్తామన్నారు. ఎన్టీఆర్వైద్య సేవ కింద పేదవారికి రూ.25 లక్షల వరకు చికిత్స ఉంటుందని సీఎం ప్రకటించారు.






