MLA Nandamuri Balakrishna సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
MLA Nandamuri Balakrishna సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన వైసీసీ సర్కార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా నాకు 60 ఏళ్లు అంటే వాడికి 'దబిడి దిబిడే' అని హెచ్చరించారు. చదువుకుంటున్న సమయంలో తనను తన తండ్రి ఎన్టీఆర్ సినిమాల్లోకి తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మరోపక్క ఉన్న పరిశ్రమలను కూడా వెళ్లగొడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ఈ దుర్మార్గ ప్రభుత్వంపై ప్రజలు కూడా తిరగబడాలని పిలుపునిచ్చారు. ఏపీలో మళ్లీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తామని వ్యాఖ్యానించారు.

Also Read....

MM Keeravani, చంద్రబోస్ లకు గవర్నర్ సత్కారం

Read Also: మేగాలను కమ్మేసిన నిండైన అందాలు.. షామా సికిందర్ సోగసులు చూస్తే..

Next Story