అతను బీజేపీని వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం జరగదు : బీజేపీ సీనియర్ నేత

by Disha Web Desk 13 |
అతను బీజేపీని వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం జరగదు : బీజేపీ సీనియర్ నేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరడంపై బీజేపీ సీనియర్ నేత జూపూడి రంగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ చాలా గౌరవం ఇచ్చిందని అలాంటి పార్టీని ఎందుకు వంచిచాల్సి వచ్చిందో కన్నాకే తెలియాలన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు సరియైన ప్రాధాన్యత లేదు అనే విషయం కన్నా గుర్తించలేకపోయారన్నారు.

కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం జరగదని చెప్పుకొచ్చారు. 2024కి బీజేపీ రాష్ట్రంలో బలమైన పార్టీగా అవతరించబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ పనిచేసే తీరు మారదని తామంతా బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సోము వీర్రాజు ఒక్కరే పార్టీ కాదు అని పార్టీ అంటే సమూహం అని కన్నా తెలుసుకోలేక పోయారన్నారు. సోము వీర్రాజు వ్యవహార శైలిపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేయడం సరికాదని బీజేపీ సీనియర్ నేత జూపూడి రంగరాజు హితవు పలికారు.

Also Read..

టీడీపీ నేత పట్టాభిపై హోం మంత్రి తానేటి వనిత సెటైర్లు..

Next Story

Most Viewed