సెల్ఫీ మోజు: లారీని ఢీకొట్టిన స్కూటీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

by Ramesh Naini |

వాహనం నడుపుతూ సెల్ఫీ తీసుకునేందుకు చేసిన ప్రయత్నం ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది.

సెల్ఫీ మోజు: లారీని ఢీకొట్టిన స్కూటీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వాహనం నడుపుతూ సెల్ఫీ తీసుకునేందుకు చేసిన ప్రయత్నం ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. అల్లూరి జిల్లా పాడేరులోని చింతలవీధి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక మహిళ, ఇద్దరు యువకులు కలిసి స్కూటీపై ప్రయాణిస్తున్న సమయంలో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ముగ్గురికీ తీవ్ర గాయాలు కాగా, గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Next Story