సీఎం బర్త్ డే గిఫ్ట్.. పెన్షన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ

by Disha Web Desk 2 |
సీఎం బర్త్ డే గిఫ్ట్.. పెన్షన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుట్టినరోజు వేళ పెన్షనర్లకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్‌ను రూ.2750 నుంచి రూ.3000 వేలకు పెంచారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన పెన్షన్లను జనవరి 1వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. అంతకుముందు వాలంటీర్లకు సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా తీపి కబురు వచ్చింది. గ్రామ, వార్డు వాలంటీర్లకు జీతాలు పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు.

ప్రస్తుతం వాలంటీర్లకు గౌరవ వేతనంగా ప్రభుత్వం రూ.5 వేలు అందజేస్తున్న విషయం తెలిసిందే. కొత్త ఏడాదిలో ఈ 5 వేలకు అదనంగా రూ.750 అందుకోనున్నారు. మరోవైపు ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే వేడుకలను వైసీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కేక్ కట్ చేస్తూ.. ముఖ్యమంత్రికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. హ్యాపీ బర్త్ డే సీఎం జగన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.



Next Story

Most Viewed