అధికార పార్టీ ఎమ్మెల్సీకి ఘోర ప్రమాదం.. పీఏ స్పాట్ డెడ్

by Disha Web Desk 2 |
అధికార పార్టీ ఎమ్మెల్సీకి ఘోర ప్రమాదం.. పీఏ స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా అధికార వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి వాహనానికి ఘోర ప్రమాదం జరిగింది. దగదర్తి దగ్గర లారీని ఎమ్మెల్సీ కారు గురువారం అర్ధరాత్రి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ పీఏ వెంకటేశ్వర్లు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. పర్వతరెడ్డికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. కారు డ్రైవర్ పరిస్థితి కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ప్రముఖ తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అటుగా వెళ్తూ.. ప్రమాదాన్ని గమనించి వెంటనే కారు ఆపారు. వెంటనే ఎమ్మెల్సీ పర్వతరెడ్డిని, డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed