- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Road Accident: సంక్రాంతి వేళ తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం
సంక్రాంతి పర్వదినం వేళ తిరుపతి(Thirupathi) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం(Major Road Accident) చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పర్వదినం వేళ తిరుపతి(Thirupathi) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం(Major Road Accident) చోటు చేసుకుంది. రెండు బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్న ఘటనలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి మండలం(Chandragiri Mandalam) కళ్యాణి డ్యామ్(Kalyani Dam) దగ్గర ఏపీఎస్ఆర్టీసీ(APSRTC)కి చెందిన రెండు అదుపు తప్పి ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది పైగా ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరూ చనిపోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన చోట రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో రెండు కిలోమీటర్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సులను తొలగించి, ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేపడతామని స్థానిక సీఐ తెలిపారు.






