కోడికత్తి కేసు నిందితుడు శ్రీను బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

by Disha Web Desk 1 |
కోడికత్తి కేసు నిందితుడు శ్రీను బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌
X

దిశ, వెబ్ డెస్క్ : వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లుగా జైలులో ఉన్న తనుకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు శ్రీను గతంలో ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది. విచారణ సందర్భంగా నిందితుడు శ్రీను తరపు న్యాయవాది సీఎం జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లుగా వెల్లడించింది.



Next Story

Most Viewed