రాంబాబూ!సంజన, సుకన్యల గురించి అడగడంలేదు: అంబటికి అయ్యన్నపాత్రుడు కౌంటర్

by Disha Web Desk 21 |
రాంబాబూ!సంజన, సుకన్యల గురించి అడగడంలేదు: అంబటికి అయ్యన్నపాత్రుడు కౌంటర్
X

దిశ , డైనమిక్ బ్యూరో : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య ట్విటర్ వార్ తారా స్థాయికి చేరింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులు, జనసేన పార్టీలపై ట్విటర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అందుకు అయ్యన్నపాత్రుడు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవలే లోకేశ్ ఢిల్లీ పర్యటనపై ట్విటర్ వేదికగా అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. దానికి అయ్యన్నపాత్రుడు సైతం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాజాగా జైలులో చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయాలంటూ టీడీపీ డిమాండ్‌పై అంబటి రాంబాబు స్పందించారు. ‘చంద్రబాబు నాయుడుకు ఏసీ కావాలని టీడీపీవారు నానా యాగీ మొదలుపెట్టారు.ఏసీ కావాలంటున్నవారు భారతదేశంలో జైళ్ళకు సంబంధించిన నిబంధనలు తెలిసి మాట్లాడాలి’ అని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. చంద్రబాబుకు ఒకవేళ ఏసీ కావాలంటే, చల్లదనం వల్ల చంద్రబాబుకు డెర్మటాలజీ సమస్యలు తగ్గుతాయనుకుంటే.. ఆ విషయాన్ని చంద్రబాబు లాయర్లు లేదా చంద్రబాబు కుటుంబం మీడియాలో మాట్లాడి, దాన్ని రాజకీయం చేసుకుంటుందా..? లేక, కోర్టు మెట్లు ఎక్కి కోర్టును అడుగుతుందా..? అని నిలదీశారు. ఇందుకు మళ్లీ అయ్యన్నపాత్రుడు ఘాటుగా రిప్లై ఇచ్చారు. మంత్రి అంబటి నుద్దేశించి హాట్ ట్వీట్ చేశారు.‘రాంబాబు మేము అరగంట అడగలేదు. ఇంకేం చెయ్యవా అని అడగడంలేదు. సంజన, సుకన్యల గురించి అడగలేదు. ప్రభుత్వ వైద్యుల సూచనలు పాటించమని మాత్రమే కోర్టుని కోరాం’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. అయితే ఈ ట్విటర్ వార్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Next Story