జలదిగ్బంధంలో విజయవాడ బస్టాండ్.. బస్సులు నిలిపివేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-13 14:42:48  IST  )

ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ...

జలదిగ్బంధంలో విజయవాడ బస్టాండ్.. బస్సులు నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో పలు ప్రాంతాల్లో వర్షం(Rains) దంచికొడుతోంది. ఉదయం నుంచి కురిసిన వర్షంతో మరికొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ(Vijayawada)లో కురిసిన ఎడతెరిపి లేకుండి కురిసన వానంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయవాడ విద్యాధరపురం బస్టాండ్ మొత్తం నీళ్లు నిలిచిపోయాయి. ఈ మేరకు బస్సులన్నింటిని నిలివేశారు. బస్టాండ్ ప్రాంగణం మొత్తం 2 అడుగుల మేర నీళ్లు నిలిచి చెరువును తలపిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మోటార్లతో నీటిని తొలగిస్తున్నారు. మరోవైపు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

డేంజర్ జోన్‌లో మంగళగిరి.. పునరావాసాలకు ప్రజల తరలింపు

Next Story