- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఎండలు దంచికొడుతుంటే, మరికొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh) ప్రజలకు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది.
ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. నేడు(ఆదివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఇవాళ పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో విజయనగరం-10, పార్వతీపురం మన్యం-2 మండలాల్లో తీవ్ర వడగాలులు (12), అలాగే 19 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.