- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామాలయం వద్ద నాపై హత్యాయత్నం.. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే: రఘురామరాజు
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు రామాలయం వద్ద తనపై హత్యాయత్నం జరిగిందని, ఘటన కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) ఆకివీడు రామాలయం(Akiveedu Ramalayam Temple) వద్ద తనపై హత్యాయత్నం(Murder Attempt) జరిగిందని, ఘటన కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఆకివీడు రామాలయాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తోందని, ఆ విషయంలో ఎప్పటి నుంచో వివాదం ఉందని తెలిపారు. అయితే వారంతా హిందువులేనని, కానీ వేరే మతం పేరుతో కొనసాగుతున్నారని చెప్పారు. అందువల్లే అక్కడ రామాలయాన్ని వద్దని, కనీసం శుభ్రం చేసినా వాళ్లు ఒప్పుకోవడం లేదని తెలిపారు.
ఆకివీడులోకి బయట వాళ్లు
గురువారం సాయంత్రమే బయట వాళ్లు ఆకివీడు గ్రామంలోకి వచ్చారని, ముందుగా ప్లాన్ చేసి రాళ్లు, కత్తులు, మేకులతో తనపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. వారిలో కొందరిని గుర్తించానని చెప్పారు. రామ భక్తల ముసుగులో దాడి చేసేందుకు ప్రయత్నం చేశారని, తృటిలో మిస్ అయ్యానని, లేనిపక్షంలో పరిస్థితి వేరేగా ఉండేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న రామాలయం వద్ద శ్రీరామనవమి రోజు ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనను ఆదిలోనే అరికట్టాలని, లేనిపక్షంలో వికృతి వెర్రితలలు వేస్తుందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.






