- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టీడీపీ-BJP-జనసేన పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముంగిట ఎట్టకేలకు టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. సీట్లు సర్దుబాటుపై క్లారిటీ రావడంతో ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఆరేళ్లతో తర్వాత టీడీపీ మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరింది. ఈ క్రమంలో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో మార్పు కోసమే టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తు పెట్టుకుందని తెలిపారు. సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు జరగాల్సి ఉందని చెప్పారు. మా కూటమికి ప్రజల మద్దతు ఉంటుందని నమ్ముతున్నామని అన్నారు. అధిష్టానం తనను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ నుంచే బరిలోకి దిగుతానని ఆమె స్పష్టం చేశారు.
Next Story