APPSC కేసులో రెండో రోజు పీఎస్ఆర్ ఆంజనేయులు విచారణ

by Jakkula.Mamatha |

ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో నిందితుడు పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు నిన్న(ఆదివారం) విచారించిన విషయం తెలిసిందే.

APPSC కేసులో రెండో రోజు పీఎస్ఆర్ ఆంజనేయులు విచారణ
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో నిందితుడు పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు నిన్న(ఆదివారం) విచారించిన విషయం తెలిసిందే. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో నిందితులు ఏ1 పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ2 మధుసూదన్​లను ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించారు.

వారిని ఆదివారం రాత్రి సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. పీఎస్ఆర్‌ను సుమారు 30కి పైగా ప్రశ్నలను పోలీసులు అడిగారని సమాచారం. ఈ క్రమంలో వారిని పోలీసులు రెండో రోజు(సోమవారం) విచారించనున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఇద్దరిని విజయవాడ జైలుకు తరలించనున్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులుకు నేటితో కస్టడీ ముగియనుంది.

Next Story