అయోధ్యలో ఆ దృశ్యమే గుర్తొచ్చింది.. స్వర్గీయ ఎన్టీఆర్‌పై మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
అయోధ్యలో ఆ దృశ్యమే గుర్తొచ్చింది..  స్వర్గీయ ఎన్టీఆర్‌పై మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: స్వర్గీయ నందమూరి తారకరామారావు, పీవీ నరసింహరావుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ‘ప్రజాగళం’ పేరుతో ఉమ్మడి సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ.. తెలుగు ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగం చేశారు. ప్రధానంగా స్వర్గీయ ఎన్టీఆర్, పీవీ నరసింహరావును స్మరించుకున్నారు.


ఎన్టీఆర్ రాముడి పాత్రలో జీవించారని తెలిపారు. అయోధ్య రాముడి విగ్రహం ప్రతిష్టాపన వేళ ఆ దృశ్యమే గుర్తొచ్చిందని చెప్పారు. తెలుగు బిడ్డ పీవీకి భారత రత్న ఇచ్చి గౌరవించామన్నారు. ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల వేళ ఆయన స్మారక నాణెం విడుదల చేశామని చెప్పారు. గతంలో ఎన్టీఆర్‌‌ను అప్పటి ప్రధాని ఇందిర చాలా ఇబ్బందులకు గురి చేశారని ప్రధాని మోడీ గుర్తు చేశారు.

Read More..

ప్రజాగళం సభలో వారి పై ఫైర్ అయిన ప్రధాని మోడీ..

Next Story

Most Viewed