జగన్ నిజస్వరూపం ప్రధానికి తెలిసిపోయింది..ఇకపై జైలర్ సినిమానే: రఘురామ కృష్ణంరాజు

by Disha Web Desk 21 |
జగన్ నిజస్వరూపం ప్రధానికి తెలిసిపోయింది..ఇకపై జైలర్ సినిమానే: రఘురామ కృష్ణంరాజు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రధాని నరేంద్రమోడీకి సీఎం వైఎస్ జగన్ నిజస్వరూపం తెలిసిపోయిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో ‘జైలర్’సినిమా కనిపించబోతోందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో రజనీకాంత్ తన సొంత కుమారుడే పోలీస్ ఉన్నతాధికారిగా ఉండి దొంగతనాలకు పాల్పడుతుంటే... వాటిని చూడలేక కొడుకునే చంపేస్తాడని సినిమా కథ చెప్పుకొచ్చారు. ఏపీలో ఇలాంటి దృశ్యాలే కనిపించబోతున్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తుండటంపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.పురంధేశ్వరిపై తమ పార్టీ నేతలు కారుకూతలు కూస్తున్నారని...ఆ మాటలు వింటుంటే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అని కూడా చూడకుండా దారుణంగా మాట్లాడుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. తమ నేతల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ పల్లెత్తు మాట కూడా అనడం లేదని... ఇదేనా రాష్ట్రంలో మహిళలకు ఇస్తున్న రక్షణ అని నిలదీశారు. ఒక్క మహిళను అవమానించినా రాష్ట్రంలోని అందరు మహిళలను అవమానించినట్టేనని ఈ విషయాన్ని జగన్ గుర్తెరగాలి అని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు.

Next Story

Most Viewed