ఆటోను ఢీకొట్టిన మంత్రి ఆదిమూలపు ఎస్కార్ట్ వాహనం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

by Disha Web Desk 16 |
ఆటోను ఢీకొట్టిన మంత్రి ఆదిమూలపు ఎస్కార్ట్ వాహనం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటోను మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇజ్రాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే ప్రమాద సమయంలో ముందు వాహనంలోనే మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. అయితే బాధిత కుటుంబాన్ని పరిమర్శించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఇజ్రాయిల్ కుటుంబం, బంధువులు ఆందోళనకు దిగింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. మరి మంత్రి స్పందిస్తారా లేదా అనేది చూడాలి.


Next Story

Most Viewed