16న టీడీపీలోకి ఒంగోలు ఎంపీ.. కుమారుడితో కలిసి చేరిక

by Disha Web Desk 16 |
16న టీడీపీలోకి ఒంగోలు ఎంపీ.. కుమారుడితో కలిసి చేరిక
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 16న తెలుగుదేశం పార్టీలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి చేరనున్నారు. ఆయనతో పాటు కుమారుడు రాఘవరెడ్డి సైతం సైకిల్ ఎక్కబోతున్నారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ‌గా గెలిచారు. అయితే ఈసారి ఆయనకు సీఎం జగన్ సీటు నిరాకరించారు. దీంతో కొంతకాలంగా వైసీపీకి మాగుంట దూరంగా ఉన్నారు. మాగుంటను వైసీపీలోనే ఉంచేందుకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు చాలా ప్రయత్నం చేశారు. అయినా సరే వైసీపీకి మాగుంట గుడ్ బై చెప్పక తప్పలేదు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించిన ఆయన చివరకు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబానికి లిక్కర్ వ్యాపారులున్నాయి. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇటీవల అప్రూవర్‌గా మారారు.

Read More..

16న సీఎం జగన్ పర్యటన..అక్కడే అభ్యర్థుల తుది జాబితా రిలీజ్



Next Story

Most Viewed